మాస్ మహారాజా రవితేజ హీరోగా పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్ హీరోయిన్స్ గా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం “డిస్కోరాజా“. ఈ చిత్రం తాజా షెడ్యూల్ సెప్టెంబరు 2 నుంచి గోవాలో జరుగుతుంది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నిర్మాత రామ్ తాళ్లూరి చిత్ర విశేషాలను తెలుపుతూ.. “ఇప్పటి వరకూ హైదరాబాద్, డిల్లీల్లో చిత్రీకరణ జరిపాం. వినాయక చవితి రోజున డిస్కోరాజా ఫస్ట్లుక్ విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను డిసెంబరు 20న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తాం అన్నారు..!
- Advertisement -