మాస్ రాజా రవితేజ ఏడాది విరామం తరువాత సినిమాల విషయంలో జోరు పెంచారు. నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని వరుస పరాజయాల తరువాత ఏడాది విరామం తీసుకున్న రవితేజ ఒకేసారి రెండు చిత్రాల్ని పట్టాలెక్కించారు. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో `డిస్కోరాజా`, గోపిచంద్ మలినేనితో `క్రాక్` చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో వి.ఐ. ఆనంద్తో చేస్తున్నా `డిస్కోరాజా` ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇందులో రెట్రో లుక్లో కనిపిస్తున్న రవితేజ గెటప్కు సంబంధించిన స్టిల్స్, ఈ చిత్ర టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాల్ని క్రియేట్ చేసేసింది. 90వ దశకంలో తనదైన డిస్కో మ్యూజిక్తో యురతరాన్ని ఉర్రూతలూగించిన డిస్కోకింగ్ బప్పీలహిరి ఈ చిత్రం కోసం రవితేజతో కలిసి ఓ పాటని పాడారు. ఈ పాట కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ని కూడా చేసే ఆలోచన వుందని హీరో రవితేజ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకని చిత్ర బృందం నిర్వహించింది.
ఈ సందర్భఢంగా హీరో రవితేజ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. చిన్నతనం నుంచి తాను చూసిన పాత్రల్నిజోడించి ఈ చిత్ర కథని దర్శకుడు ఆనంద్ మలిచారని, దాంతో మరో ఆలోచన లేకుండా ఈ చిత్రాన్ని అంగీకరించానని, అన్నీ సవ్యంగా కుదిరితే ఈ చిత్రానికి సీక్వెల్ని కూడా తెరపైకి తీసుకొచ్చే ఆలోచన వుందని అసలు విషయం బయటపెట్టేశారు. తమన్తో తనకిది 11వ సినిమా అని, ఇప్పటికే పాటలు మంచి విజయాన్ని సాధించాయని, అదే స్థాయిలో సినిమా కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకం వుందని స్పష్టం చేశారు.