ఈరోజు విడుదల అయిన ఏ మంత్రం వేసావే డిజాస్టర్ గా తేలింది . విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరో అయినప్పటికీ అది ఇప్పటి సినిమా కాదు 2015 లో ప్రారంభమైన సినిమా . అయితే సకాలంలో షూటింగ్ పూర్తికాక ఇలా ఆలస్యంగా ఇప్పుడు విడుదల అయ్యింది . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి లాంటి సంచలన విజయాల తర్వాత వచ్చిన ఈ చిత్రం విజయ్ దేవరకొండ కు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యింది కెరీర్ పరంగా .
- Advertisement -
శశిధర్ మర్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉన్నప్పటికీ దాన్ని సరైన వేలో చూపించలేక పోవడంతో సినిమా చతికిల బడింది . మొత్తానికి ఏ మంత్రం వేసావే చిత్రం ఫలితం విజయ్ దేవరకొండ ముందుగానే ఊహించి నట్లున్నాడు అందుకే సినిమా ప్రమోషన్ లో పాల్గొనలేదు .
- Advertisement -