సైరా నరసింహా రెడ్డి సూపర్ హిట్ తర్వాత స్టార్ హీరోలతో సినిమా చేయాలని ప్రయత్నించిన డైరక్టర్ సురేందర్ రెడ్డి అఖిల్ తో సినిమా షురూ చేశాడు. ఏజెంట్ అంటూ వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న అఖిల్ ఏజెంట్ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తుంది. సినిమాలో ఆమె నటన చూసి ఫిదా అయ్యాడట డైరక్టర్ సురేందర్ రెడ్డి. ఆమె నటనకు ఇంప్రెస్ అయిన సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ సినిమాలో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట.
అఖిల్ ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో కూడా సాక్షి వైద్యని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నాడట. ఏజెంట్ రిలీజ్ తర్వాత పవన్ సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. ఆల్రెడీ ఏజెంట్ సినిమా 70 శాతం కు పైగా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. అఖిల్ ఏజెంట్, పవన్ సినిమాలతో డైరక్టర్ గా సురేందర్ రెడ్డి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాలు ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.