Homeటాప్ స్టోరీస్బయోపిక్స్ పై సంచలన కామెంట్ చేసిన దర్శకుడు

బయోపిక్స్ పై సంచలన కామెంట్ చేసిన దర్శకుడు

director singeetham srinivasarao sensational comments on biopicsతెలుగునాట బయోపిక్ లు చాలానే వస్తున్నాయి కానీ వాటిలో నిజాలు ఎక్కడున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు . ఇప్పటికే మహానటి చిత్రం విడుదలై సంచలన విజయం సాధించినప్పటికీ , ఆ సినిమాపై బోలెడు విమర్శలు వచ్చాయి . సావిత్రి గొప్పతనం చూపించడానికి కొన్ని తప్పుడు సన్నివేశాలు చూపించారని అలాగే జెమిని గణేశన్ ని తక్కువ చేసి చూపించారని …….. వాస్తవాలను వక్రీకరించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే .

 

- Advertisement -

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర బయోపిక్ , కత్తి కాంతారావు , కే విశ్వనాధ్ , ఇలా రకరకాల బయోపిక్ లు రెడీ అవుతున్నాయి . అయితే బయోపిక్ అనగానే కమర్షియల్ అంశాల కోసం , కమర్షియల్ హిట్ కోసం అసలు వాస్తవాలు చిత్రీకరించడం లేదని …… అసలు వాస్తవాలు ప్రజలకు తెలిస్తేనే అది నిజమైన బయోపిక్ అవుతుంది కానీ వాస్తవాలను వక్రీకరించి తీస్తే అది బయోపిక్ ఎలా అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసాడు సింగీతం శ్రీనివాసరావు . ఎన్టీఆర్ , కత్తి కాంతారావు , సావిత్రి , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల గురించి ఈ దర్శకుడి కి బాగా తెలుసు కానీ బయోపిక్ లలో అన్ని వాస్తవాలు చూపిస్తే అభిమానులు తట్టుకోవడం కష్టం మరి .

English Title: director singeetham srinivasarao sensational comments on biopics

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All