Homeగాసిప్స్పరశురామ్ తన నుంచే మొదలుపెట్టారా?

పరశురామ్ తన నుంచే మొదలుపెట్టారా?

పరశురామ్ తన నుంచే మొదలుపెట్టారా?
పరశురామ్ తన నుంచే మొదలుపెట్టారా?

యువ దర్శకుడు పరశురామ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’వంటి హిట్ సినిమా తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారిపాట’ .

మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం ఫస్ట్ లుక్ పొస్టర్ని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ మూవీ కోసం దర్శకుడు పరశురామ్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టు తెలిసింది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం పరశురామ్ రెమ్యూనరేషన్ 10 కోట్లుగా మాట్లాడుకున్నారట. అయితే కరోనా కారణంగా బడ్జెట్ తగ్గించుకోవాలని చాలా మంది చెబుతుండటంతో పరశురామ్ తన పారితోషికాన్ని 10 నుంచి 7 కోట్లకు తగ్గించుకుని కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టు చెబుతున్నారు. మహేష్ సరసన సాయీ ముఖర్జీ నటించనున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నుంచి ప్రారంభిస్తారట.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All