Homeటాప్ స్టోరీస్దిల్ రాజుకేమైనా మెంటలా అన్నారట

దిల్ రాజుకేమైనా మెంటలా అన్నారట

దిల్ రాజుకేమైనా మెంటలా అన్నారట
దిల్ రాజుకేమైనా మెంటలా అన్నారట

దిల్ రాజు ప్రస్తుతం తన హవాను డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గా ముగిసిన సంక్రాంతి సీజన్ ను దిల్ రాజు ఏ విధంగా క్యాష్ చేసుకున్నాడో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు చిత్రాల నైజాం హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో నుండి భారీగా లాభపడ్డాడు. గతేడాది పొందిన నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా కొత్త సినిమాలను నిర్మించేందుకు అవసరమైన జోష్ ను తెచ్చుకున్నాడు. దిల్ రాజు ప్రస్తుతం జాను సినిమా రిలీజ్ సన్నాహాకాల్లో బిజీగా ఉన్నాడు. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే సరైన రిలీజ్ డేట్ గురించి వెయిట్ చేస్తూ ఈ చిత్ర రిలీజ్ ను హోల్డ్ లో పెట్టి ఫైనల్ గా ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి నిశ్చయించాడు.

అయితే ఇన్నాళ్లూ ఈ సినిమా రిలీజ్ విషయంలో చప్పుడు చేయకుండా ఉన్న దిల్ రాజు గత పది రోజుల నుండి ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసి నిన్న ట్రైలర్ ను కూడా లాంచ్ చేసేసారు. ట్రైలర్ చూస్తుంటే తమిళంలోని మ్యాజిక్ ను ఆల్మోస్ట్ రిక్రియెట్ చేసారని చెప్పవచ్చు. జాను తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 96 చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెల్సిందే.

- Advertisement -

అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో మాట్లాడుతూ దిల్ రాజు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 96 చిత్రాన్ని విడుదల కంటే ముందే చెన్నైలో ప్రివ్యూ థియేటర్ లో చూశానని, సినిమా చూసిన వెంటనే రీమేక్ చేయాలనీ నిర్ణయించుకున్నానని చెప్పాడు. సాధారణంగా తాను రీమేక్స్ చేయనని, అయితే తాను పొందిన అనుభూతి తెలుగు ప్రేక్షకులందరూ పొందాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రీమేక్ చేసానని చెప్పాడు. అయితే 96 సినిమా రీమేక్ గురించి ప్రకటించినప్పుడు దిల్ రాజుకేమైనా మెంటలా? ఎందుకు క్లాసిక్ ను టచ్ చేస్తున్నాడు అన్నారు. అయితే సినిమా చూసాక నేను ఎలాంటి అనుభూతిని పొందానో, అందరూ కూడా అదే అలాంటి అనుభూతినే పొందుతారు అని తెలిపాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All