Homeగాసిప్స్మెగా హీరోల‌తో దిల్ రాజు మ‌ల్టీస్టార‌ర్‌?

మెగా హీరోల‌తో దిల్ రాజు మ‌ల్టీస్టార‌ర్‌?

మెగా హీరోల‌తో దిల్ రాజు మ‌ల్టీస్టార‌ర్‌?
మెగా హీరోల‌తో దిల్ రాజు మ‌ల్టీస్టార‌ర్‌?

వ‌రుస చిత్రాల్ని నిర్మిస్తూ య‌మ బిజీగా వున్నారు దిల్ రాజు. మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో చేయాల‌నుకున్న భారీ చిత్రం స్టోరీ కార‌ణంగా ఆగిపోయింద‌ని వార్త‌లు వినిపిస్తున్న వేళ దిల్ రాజు ఓ క్రేజీ కాంబినేష‌న్‌ని సెట్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో హిందీ హిట్ చిత్రం `పింక్‌`ని తెలుగులో బోనీ క‌పూర్‌తో క‌లిసి రీమేక్ చేస్తున్న దిల్ రాజు త‌రువాత చిత్రాన్ని కూడా మెగా హీరోతో ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇటీవల బాలీవుడ్ హిట్ చిత్రం `బ‌ద్లా`ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి అడివి శేష్ హీరోగా పీవీపీ సంస్థ `ఎవ‌రు` పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే. రెజీనా క‌సాండ్ర హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం ద్వారా రామ్‌జీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. గ‌త ఏడాది ఆగ‌స్టులో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించి ఊహించ‌ని లాభాల్ని తెచ్చిపెట్టింది.

- Advertisement -

ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రామ్‌జీ ఓ మల్టీస్టార‌ర్ క‌థ‌ని ఇటీవ‌ల నిర్మాత దిల్ రాజుకు వినిపించార‌ట‌. క‌థ కొత్త‌గా వుండ‌టంతో సినిమా చేద్దామ‌ని గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రంలో మెగా హీరోలు వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టించే అవ‌కాశం వుంద‌ని, ఇప్ప‌టికే దిల్ రాజు వారితో ఈ ప్రాజెక్ట్ గురించి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలిసింది. సాయిధ‌ర‌మ్‌తేజ్ `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` చిత్రంతో బిజీగా వున్నాడు. వ‌రుణ్‌తేజ్ ఇటీవ‌లే త‌న కొత్త చిత్రం `బాక్స‌ర్‌`రెగ్యుల్ షూటింగ్‌ని వైజాగ్‌లో మొద‌లుపెట్టాడు. ఈ ఇద్ద‌రు ఫ్రీ అయిన త‌రువాతే మెగా మ‌ల్టీస్టార‌ర్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All