దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. భారతీయ సినీ ప్రపంచంలో సరికొత్త రికార్డులతో పాటు భారతీయ సినిమాని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెట్టిన చిత్రం `బాహుబలి`. ఈ సినిమాతో రాజమౌళి ఖ్యాతి, తెలుగు సినిమా ఉనికి ఖండాంతరాలకు పాకింది. ఇప్పుడు తెలుగు నుంచి సినిమా వస్తోందంటే చాలు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారుతోంది. రాజమౌళి నుంచి సినిమా అంటే ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` పేరుతో భారీ మల్టీస్టారర్ చిత్రానికి తెనలేపిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ప్రతి నిత్యం వార్తల్లో నిలుస్తోంది. స్టోరీ దగ్గరి నుంచి కీలక పాత్రలు, గెటప్ల.. ఇలా ప్రతీదీ ఓ సంచలనంగా మారుతోంది. దీంతో నిర్మాణ దశలో వుండగానే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ పెరిగింది. ఇటీవల రిలీజ్ బిఫోర్ బిజినెస్ పరంగా 200 కోట్ల బిజినెస్ చేసిందని ప్రచారం జరుగుతోంది.
అయితే అందులో నైజాం వాటా ఇంకా ఎవరూ సొంతం చేసుకోలేదని, దీనికి పెద్ద పోటీ ఏర్పడిందని,దిల్ రాజుతో పాటు పలువురు డిస్ట్రిబ్యూటర్లు నైజాం హక్కుల కోసం పోటీపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా నైజాం హక్కుల్ని తానే సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న దిల్ రాజు `ఆర్ ఆర్ ఆర్` టీమ్కు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 75 కోట్లు నైజాం ఏరియాకు ఇస్తానని దిల్ రాజు ఆఫర్ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాలని షాక్కు గురిచేస్తోంది. ఇంత మొత్తం ఇస్తే వర్కవుట్ అవుతుందా? అన్నది మిగతా వారి వాదన.