పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత చేసిన చిత్రం `వకీల్ సాబ్`. శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఏప్రిల్ 9 న విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్`ఆధారంగా బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే విడుదలైన కొన్ని రోజులు భారీ వసూళ్లని సాధించిన ఈ చిత్రం కరోనావైరస్ కేసులో పెరుగుదల నేపథ్యంలో థియేట్రికల్ రన్ ఇబ్బందికరంగా మారింది.
దీంతో ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ రోజు రాత్రి 12 గంటలకు అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం `వకీల్ సాబ్` నిర్మాత దిల్ రాజుకు 12 కోట్ల రూపాయలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామాను 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేయడానికి ముందే OTT ప్లాట్ఫాంపై ప్రసారం చేయడానికి అనుమతిస్తే దిల్ రాజుకు అదనంగా రూ .12 కోట్లు చెల్లించడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ముందే అంగీకరించింది.
ఇప్పుడు ఈ చిత్రం థియేటర్ విడుదలైన ఇరవై రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. కాబట్టి అమెజాన్ దిల్ రాజుకు 12 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఈ మూవీలోని కీలక పాత్రల్లో నివేదా థామస్, అంజలి, ప్రకాష్ రాజు, శ్రుతి హాసన్, అనన్య నాగల్ల నటించారు.