ఇటీవల తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిషన్ రంగంలో కొత్త తుఫాను ప్రారంభమైంది. ఎగ్జిబిటర్లు మరియు పంపిణీదారులు నిలువుగా రెండు చీలిపోయారు. సురేష్ బాబు, ఎఫ్డిసి చైర్మన్ రామ్ మోహన్ తదితరులు మద్దతు ఇస్తున్న వర్గం ప్రస్తుత థియేట్రికల్ అద్దె వ్యవస్థను పర్సెంటేజ్ విధానంగా మార్చడానికి అనుకూలంగా ఉంది. ఇది గతంలో వున్నదే. దాన్ని కొంత మంది తమ అనుకూలంగా మార్చుకుని థియేటర్స్ రెంటల్ విధానంగా మార్చారు. మళ్లీ అదే పాత పద్ధతిని అమలు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఇది దిల్ రాజు తో పాటు అతని సోదరుడు నాయకత్వం వహిస్తున్న వర్గాలు ఈ పద్దతిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న థియేట్రికల్ అద్దె వ్యవస్థను కొనసాగించాలని వారు కోరుకుంటున్నారు. అదే వుండాలని బలంగా వాదిస్తున్నారు. ప్రతి సంవత్సరం దిల్ రాజు చాలా చిత్రాలని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. థియేటర్ అద్దె విధానం వల్లే నిర్మాతల నుంచి ఆయనకు భారీ స్థాయిలో లాభాల్ని తెచ్చిపెడుతోంది. దీని వల్ల ఎగ్జిబిటర్లకు మాత్రమే లాభం కలుగుతోంది. దీన్ని ఎత్తివేయాలని నిర్మాతల్లో అత్యధిక శాతం మంది కోరుకుంటున్నారు.
ఇటీవల ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమావేశం జరిగింది. దీనికి దిల్ రాజును ఆహ్వానించారు. అతను సమావేశానికి హాజరుకాలేదు. పర్సెంటీజీ విధానానికి తాను వ్యతిరేకం అని దిల్ రాజు తన వైఖరిని తెలియజేసినట్టు తెలిసింది. తెలంగాణ ఎగ్జిబిషన్, పంపిణీ వ్యవస్థలో రానున్న రోజుల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ఈ సంఘటనతో సుస్సష్టంగా తెలుస్తోంది.