Homeటాప్ స్టోరీస్దేవిశ్రీకి తత్త్వం బోధపడట్లేదు

దేవిశ్రీకి తత్త్వం బోధపడట్లేదు

Devi Sri Prasad
దేవిశ్రీకి తత్త్వం బోధపడట్లేదు

దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో మ్యూజిక్ సంచలనం. సినిమాల్లోకి రావడమే సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ అందించిన దేవిశ్రీ అనతికాలంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అప్పటికే ఇండస్ట్రీని శాసిస్తున్న మణిశర్మ, కీరవాణి లాంటి వాళ్లకు ప్రత్యామ్నాయంగా మారాడు. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన థమన్, అనూప్ రూబెన్స్ వంటి వారినుండి ఎంత కాంపిటీషన్ వచ్చినా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఎప్పటికప్పుడు మ్యూజిక్ విషయంలో అప్డేట్ అవుతూ నెం 1 మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి పాటలు అందించాడు.

కానీ గత రెండు మూడేళ్ళుగా దేవిశ్రీ గ్రాఫ్ బాగా డౌన్ అయింది. రొటీన్ మ్యూజిక్ అందిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. రంగస్థలం వంటి ఒకటి రెండు సినిమాలు తప్ప ఈ రెండేళ్లలో దేవి అందించిన హిట్ ఆల్బమ్స్ పెద్దగా లేవు. అయినా కానీ దేవి ఎందుకు ఈ విషయం గ్రహించట్లేదో అర్ధం కావట్లేదు. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు దేవిని దూరం పెట్టేసారు. ఇప్పుడు కొరటాల శివ కూడా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూస్తున్నాడని తెలుస్తోంది. హీరోలలో అల్లు అర్జున్ ఫస్ట్ ప్రయారిటీ మారిపోయింది. మహేష్ మాత్రమే రిపీట్ చేస్తున్నాడు.

- Advertisement -

సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ వింటే దేవిశ్రీ ఇంకా పాత ఆలోచనలతోనే ఉన్నాడని అర్ధమైపోతుంది. మహేష్ ఫ్యాన్స్ కూడా దేవిశ్రీ వద్దని కోరుకున్నారు. మరి ఇంత జరుగుతున్నా దేవిశ్రీకి తత్త్వం బోధపడట్లేదా? తనని తాను అప్డేట్ చేసుకుని మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకోగలడా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All