Homeటాప్ స్టోరీస్“రాత్రికి రెడీగా ఉండండి..!”  అంటున్న దేవి శ్రీ ప్రసాద్

“రాత్రికి రెడీగా ఉండండి..!”  అంటున్న దేవి శ్రీ ప్రసాద్

“రాత్రికి రెడీగా ఉండండి..!”  అంటున్న దేవి శ్రీ ప్రసాద్
“రాత్రికి రెడీగా ఉండండి..!”  అంటున్న దేవి శ్రీ ప్రసాద్

కరోనా వైరస్ పై అవగాహన కల్పించడానికి మరియు ప్రజలకుఈ క్వారంటైన్ సమయంలో కొంచెం వినోదం కూడా పంచడానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా సిద్ధమయ్యారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపులో భాగంగా ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఎలక్ట్రిక్ లైట్లు అన్ని ఆఫ్ చేసి దీపాలు, కొవ్వొత్తులు లేదా సెల్ ఫోన్ టార్చ్ వెలుగులను తొమ్మిది నిమిషాల పాటు ఎవరి ఇంట్లో వారు వెలిగించి… కరోనా వైరస్ పై పోరాటంలో యావత్ భారతదేశం అంతా సమైక్యంగా పోరాడుతున్నామనే సందేశం ఇవ్వాలని ప్రధాని సూచించారు.

తను రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వస్తాననీ… ప్రజల కోసం కొత్త రకమైన సంగీతం తో అలరిస్తానని దేవీ తన ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. ఇక నుండి ఎప్పటికప్పుడు లైవ్ కి వస్తూ అప్ డేట్స్ ఇస్తానని దేవీశ్రీప్రసాద్ ప్రామిస్ చేసారు. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని దేవిశ్రీ ప్రసాద్ విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All