Homeటాప్ స్టోరీస్`దేవి` హీరోయిన్‌ మూడో పెళ్లికి రెడీ?

`దేవి` హీరోయిన్‌ మూడో పెళ్లికి రెడీ?

`దేవి` హీరోయిన్‌ మూడో పెళ్లికి రెడీ?
`దేవి` హీరోయిన్‌ మూడో పెళ్లికి రెడీ?

న‌టుడు విజ‌య్‌కుమార్, న‌టి మంజుల పెద్ద కుమార్తె వ‌నిత‌ మూడో పెళ్లికి రెడీ అవుతోందా? అంటే త‌మిళ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. విజ‌య్ హీరోగా నటించిన `చంద్ర‌లేఖ‌` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వ‌నిత ఆ త‌రువాత ఎం.ఎస్‌. రాజు నిర్మించిన `దేవి` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. న‌టుడు ఆకాష్‌ని ప్రేమించి పెళ్లాడిన వ‌నిత ఇద్ద‌రు పిల్లలు పుట్టిన త‌రువాత అత‌నితో అభిప్రా య భేధాలు త‌లెత్త‌డంతో విడిపోయింది.

రెండేళ్ల త‌రువాత బిజినెస్‌మెన్ ఆనంద్ జ‌య‌వ‌ర్ధ‌నేని వివాహం చేసుకుంది. వీరికి ఓ కూతురు పుట్టింది. అత‌ని నుంచి కూడా విడిపోయిన వ‌నిత ఆ త‌రువాత నుంచి నిత్యం వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తూ త‌మిళ నాట సంచ‌ల‌నంగా మారింది.  బిగ్‌బాస్ 3లో పాల్గొని వార్త‌ల్లో నిలిచింది. గ‌త కొం త‌కాలంగా డ్యాన్స్ మాస్టర్ రాబ‌ర్ట్ తో స‌హ‌జీవ‌నం చేస్తోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అయితే వ‌నిత మాత్రం అత‌న్ని కాకుండా విజువ‌ల్ ఎఫెక్ట్స్ డైరెక్ట‌ర్ పీట‌ర్ పాల్ ని వివాహం చేసుకోబోతోంద‌ని తాజాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంపై వ‌నిత మాత్రం పెద‌వి విప్ప‌డం లేదు. దీంతో వ‌నిత ముచ్చ‌ట‌గా మూడ‌వ పెళ్లికి రెడీ అయిపోతోందంటూ వ‌రుస క‌థ‌నాలు జోరందుకున్నాయి. ఈ నెల 27న చెన్నూర్‌లోని వ‌నిత నివాసంలో వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పెళ్లి ప‌త్రిక సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All