Homeటాప్ స్టోరీస్‘దేవ‌ర సాంటా 2020`.. 600 మందికి గిఫ్ట్ లు!

‘దేవ‌ర సాంటా 2020`.. 600 మందికి గిఫ్ట్ లు!

‘దేవ‌ర సాంటా 2020`.. 600 మందికి గిఫ్ట్ లు!
‘దేవ‌ర సాంటా 2020`.. 600 మందికి గిఫ్ట్ లు!

టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌తీ ఈవెంట్‌ని.. ఫెస్టివెల్‌ని త‌న‌దైన స్టైల్లో సెల‌బ్రేట్ చేస్తున్నారు. ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ప్ర‌తీ ఏడాది `దేవ‌ర సాంటా` పేరుతో క్రిస్ట‌మ‌స్ గిఫ్ట్‌ల‌ని అందిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. 2017 నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ఏడాది కూడా దేవ‌ర సాంటా 2020 పేరుతో చిన్న పిల్ల‌ల‌కి క్రిస్మ‌‌స్ బ‌హుమ‌తుల్ని అందించారు.

క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ క్రిస్మ‌స్‌ని కూడా య‌మ క్రేజీగా జ‌రుపుకున్నారు. ఈ ఏడాది హైద‌రాబాద్‌లోని 600 మంది చిన్న పిల్ల‌ల‌కు చాక్లెట్స్‌, త‌న రౌడీ వేర్ ద్వారా బ‌ట్ట‌లు పంపిణీ చేశారు. ప్ర‌తీ ఏటా నేరుగా అభిమానుల ద‌గ్గ‌రికి వెళ్లి క‌లిసే విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ఏడాది మాత్రం క‌రోనా కార‌ణంగా త‌న టీమ్ చేత గిఫ్ట్‌ల‌ని పంపించి వీడియో కాల్ ద్వారా పిల్ల‌ల‌తో మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోని విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు.

- Advertisement -

చిన్న పిల్ల‌ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడిన విజువ‌ల్స్ ఇప్పుడు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. 600 మందికి గిఫ్ట్‌లు అందించిన రౌడీ హీరో అక్క‌డితో ఆగ‌కుండా 1000 మంది చిన్న పిల్ల‌ల‌కు త‌న ప్రేమ‌ను పంచాల‌నుకుంటున్నాడు. ఇందు కోసం దేవ‌ర సాంటా (#Deverasanta) అని హ్యాష్ ట్యాగ్ ని ట్విట్ట‌ర్‌లో, ఇన్ స్టాలో పోస్ట్ చేసి అడ్ర‌స్ పెడితే వాళ్లింటికి గిఫ్ట్‌లు పంపిస్తాన‌ని వీడియో ద్వారా విజ‌య్ తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All