టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రతీ ఈవెంట్ని.. ఫెస్టివెల్ని తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేస్తున్నారు. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతీ ఏడాది `దేవర సాంటా` పేరుతో క్రిస్టమస్ గిఫ్ట్లని అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయ్ దేవరకొండ ఈ ఏడాది కూడా దేవర సాంటా 2020 పేరుతో చిన్న పిల్లలకి క్రిస్మస్ బహుమతుల్ని అందించారు.
క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఈ క్రిస్మస్ని కూడా యమ క్రేజీగా జరుపుకున్నారు. ఈ ఏడాది హైదరాబాద్లోని 600 మంది చిన్న పిల్లలకు చాక్లెట్స్, తన రౌడీ వేర్ ద్వారా బట్టలు పంపిణీ చేశారు. ప్రతీ ఏటా నేరుగా అభిమానుల దగ్గరికి వెళ్లి కలిసే విజయ్ దేవరకొండ ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా తన టీమ్ చేత గిఫ్ట్లని పంపించి వీడియో కాల్ ద్వారా పిల్లలతో మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
చిన్న పిల్లలలో విజయ్ దేవరకొండ మాట్లాడిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. 600 మందికి గిఫ్ట్లు అందించిన రౌడీ హీరో అక్కడితో ఆగకుండా 1000 మంది చిన్న పిల్లలకు తన ప్రేమను పంచాలనుకుంటున్నాడు. ఇందు కోసం దేవర సాంటా (#Deverasanta) అని హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్లో, ఇన్ స్టాలో పోస్ట్ చేసి అడ్రస్ పెడితే వాళ్లింటికి గిఫ్ట్లు పంపిస్తానని వీడియో ద్వారా విజయ్ తెలిపారు.