Homeటాప్ స్టోరీస్ప్రజావేదిక నేలమట్టం

ప్రజావేదిక నేలమట్టం

Demolition Prajavedika
Demolition Prajavedika

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన విధుల కోసం 9 కోట్లతో కట్టించిన ప్రజావేదిక అక్రమ కట్టడమని తేల్చిన జగన్ దాన్ని కూల్చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే . ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఆదేశాలు జారీ చేయడంతో ప్రజావేదిక ని నేలమట్టం చేసారు . ఈ మధ్యాహ్నం కు ప్రజావేదిక సమూలంగా నేలమట్టం కానుంది . కరకట్టకు ఆనుకోని ఈ నిర్మాణం ఉండటంతో ప్రజావేదిక కూల్చాలని నిర్ణయించింది జగన్ ప్రభుత్వం .

అయితే ప్రజావేదిక కూల్చే సమయంలోనే చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు . ప్రజావేదిక దగ్గరకు చంద్రబాబు వెళ్ళడానికి ప్రయత్నించగా మొదట నిరాకరించిన పోలీసులు ఆ తర్వాత కేవలం చంద్రబాబు కాన్వాయ్ ని మాత్రమే అనుమతించారు . మొత్తానికి చంద్రబాబు ఎంతో ఇష్టపడి కట్టించిన ప్రజావేదిక చరిత్ర పుటల్లో నామరూపాల్లేకుండా కలిసిపోయింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All