దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలో నటించిన `పద్మావత్` చిత్రంపై అప్పట్లో వరుస వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్ణిసేనతో పాటు బీజేపీ ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని, దేశంలో రిలీజ్కు అనుమతించకూడదని, ఇందులో నటించిన దీపికని హత్య చేస్తే భారీ బహుమతి అందజేస్తామని బీజేపీకి చెందిన పలువురు నాయకులు హెచ్చరికలు చేయడంతో సంజయ్లీలా బన్సాలీ రూపొందించిన `పద్మావత్` వివాదాస్పటదమైంది. ఇన్ని వివాదాల మధ్య అసలు `పద్మావత్` రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా అదే తరహాలో వరుస వివాదాలు దీపిక నటించిన తాజా చిత్రానికి చుట్టుకుంటున్నాయి. దీంతో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అని అంతా అంటున్నారు. దీపికా పదుకోన్ నటిస్తున్న తాజా చిత్రం `ఛపాక్`. మేఘన గుల్జార్ దర్శకత్వం వహించారు. యాసిడ్బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దీపిక నటిస్తూ ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్నారు. రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్ర విడుదలని నిలిపివేయాలంటూ లక్ష్మీ అగర్వాల్ తరుపు లాయర్ అపర్ణా భట్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ న్యాయస్థానంలో అప్పీల్ చేయడం సంలచనంగా మారింది.
చిత్ర బృందం లక్ష్మీ అగర్వాల్కు కనీసం థాంక్యూ కూడా చెప్పలేదని. ఇలా జరుగుతుంటే బాలీవుడ్ బిగ్గీస్ మాత్రం మౌనంగా చూస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని అపర్ణా భట్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో `ఛపాక్` 10న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా అన్నది సస్పెన్స్గా మారింది. దీనిపై దీపిక లేదా చిత్ర బృందం ఏమని స్పందిస్తారో చూడాలి.