సాయి ధరం తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలను సన్నాసులు, వెధవలు అంటూ విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్.
ఇదిలాఉంటే ఈ ప్రస్థావనలో మోహన్ బాబుని కూడా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. మీరు బంధువులు కదా చిత్ర పరిశ్రమని హిం సించవద్దని చెప్పండి.. ఇప్పుడు సినిమాలపై పెట్టిన నిబంధనలు రేపు మీ విద్యా నికేతన్ సంస్థకు వర్తింపచేయొచ్చని అన్నారు. మీ విద్యాసంస్థ లో ఉన్న 5500 మంది విద్యార్ధుల ఫీజులు ఆన్ లైన్ లో కట్టాలని ప్రభుత్వమే తీసుకుంటే ఏం జరుగుతుందని అన్నారు. దీనిపై మోహన్ బాబు మాట్లాడాలని అన్నారు.
పవన్ వేసిన ప్రశ్నలకు మోహన్ బాబు కూల్ గా రెస్పాండ్ అయ్యారు. మై డియర్ పవన్ కళ్యాణ్ అంటూ.. నా చిరకాల మిత్రుడు సోదరుడివైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి కనుక నువ్వు అని ఏకవచనంతో సంభోదించాను.. పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమి లేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్.. సంతోషమే.. ప్రస్తుతం మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా నిలబడ్డాడన్న విషయం నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను హృదయ పూర్వకంగా సమాధానం ఇస్తానని.. ఎలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన మంచు విష్ణుకి వేసి అతని ప్యానెల్ గెలిపించాలని కోరుకుంటున్నాను.. థ్యాంక్ యు వెరీ మచ్.. అంటూ ఒక లెటర్ పెట్టారు. మొత్తానికి అక్టోబర్ 10 తర్వాత పవన్ కామెంట్స్ కు మోహన్ బాబు ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి.
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021