సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మాత డీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో క్రేజీ నిర్మాతల జాబితాలో చేరిపోయిన దానయ్య గత కొంత కాలంగా తన తనయుడిని హీరోగా తెరంగేట్రం చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం యంగ్ డైరెక్టర్ మారుతికి 6 కోట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల బడా నిర్మాతల తనయులు హీరోలుగా తెరంగేట్రం చేసి వరుస చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. తాజాగా అతని తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతను హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి `రొమాంటిక్` చిత్రంలో నటిస్తున్నాడు.
వీళ్ల తరహాలోనే నిర్మాత దానయ్య తన కుమారుడిని మారుతి దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ముందు తన కుమారుడిని హీరోగా పరిచయం చేయమని దర్శకుడు తేజకు ఆఫరిచ్చినా ఆయన అంగీకరించకపోవడంతో దానయ్య యువ దర్శకుడు మారుతిని కలిసి 6 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మారుతికి 6 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని, దానికి మారుతి కూడా అంగీకరించారని చెబుతున్నారు. `మారుతి ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా `ప్రతిరోజు పండగే` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే దానయ్య తనయుడి కోసం కథని సిద్ధం చేసే పనిలో నిమగ్నమవుతాడని చెబుతున్నారు.