కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తుఫానులా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా దీని దెబ్బకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్ని కఠినతరం చేస్తున్నట్టు ప్రదాని మోదీ గత రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మనలను నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా భారీ బడ్జెట్ చిత్రాల షూటింగ్ అని నిలిపివేయాలని నిర్ణయించింది.
మే 1 వ తేదీ వరకు 50 మందికి మించకుండా సిబ్బందితో కలిసి పనిచేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చిత్ర నిర్మాతలను కోరింది. కాబట్టి రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ రద్దు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి పరిమిత సంఖ్యలో సిబ్బందితో షూటింగ్ చేయడం అసాధ్యం కాబట్టి మేకర్స్ ఈ మూవీ షూటింగ్ని తాత్కాలికంగా నిలిపి వేశారట.
‘ఆర్ఆర్ఆర్’ షూట్ ఇప్పటికే 85 శాతం పూర్తయింది. ఈ చిత్రానికి అలియా భట్, రామ్ చరణ్ కలయికలో రెండు పాటలు, మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి వుంది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కొత్త షెడ్యూల్ నిర్ణయించి బ్యాలెన్స్ షూట్ని పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 13న విజయదశమి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.