2011 లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంపై కాపీ కేసు నమోదయ్యింది . దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించాడు . ప్రభాస్ , కాజల్ అగర్వాల్ , తాప్సి పన్ను నటించిన ఈ చిత్ర కథ కాపీ కొట్టారంటూ కోర్టు ని ఆశ్రయించారు ఆ చిత్ర కథకురాలు శ్యామల రాణి . తన కథని నా అనుమతి లేకుండానే సినిమాగా రూపొందించారని ఆరోపిస్తోంది శ్యామలా రాణి .దాంతో స్పందించిన కోర్టు నిర్మాత దిల్ రాజు పై చార్జిషీట్ దాఖలు చేయాల్సిందిగా మాదాపూర్ పోలీసులను ఆదేశించింది .
కోర్టు ఆదేశాల మేరకు 4117/ 2018 గా చార్జిషీట్ నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దిల్ రాజు కు సమన్లు పంపించారు అయితే వాటిని అందుకోకుండా పెద్ద ఎత్తున పన్నాగాలు పన్నుతున్నాడు దిల్ రాజు . పోలీసులు పంపించిన సమన్లు అందుకోకుండా తప్పించుకు తిరుగుతున్న దిల్ రాజు పై కోపంగా ఉన్నారట పోలీసులు . ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయం అందుకున్నాడు దిల్ రాజు . 11 రోజుల్లోనే 64 కోట్ల షేర్ రాబట్టి దిల్ రాజు కున్న అప్పులను కొన్నింటిని తీర్చేసింది ఎఫ్ 2 .
English Title: Copy case on Dil raju’s Mr. perfect