జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల వద్దకు వెళ్లి తన అభిప్రాయాలను పంచుకునే నిమిత్తం సభలను ఏర్పాటు చేయాలనీ భావించాడు అందులో భాగంగా జిల్లా పర్యటనలు చేయాలనుకున్నాడు కానీ జిల్లా పర్యటనలలో జనాలు పెద్ద ఎత్తున తరలివస్తారు కాబట్టి అల్లర్లు సృష్టించాలని పెద్ద కుట్ర పన్నారట కొంతమంది దుండగులు . ఇంటలిజెన్స్ నివేదికలు పవన్ కళ్యాణ్ ని హెచ్చరించడంతో జిల్లా పర్యటనలు వాయిదా వేసుకున్నాడు .
కొంతకాలం క్రితం వరకు అధికార తెలుగుదేశం పార్టీ కి మద్దతుగా నిలిచాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , కానీ ఆ తర్వాత అధికార తెలుగుదేశం పార్టీ పైన అవినీతి ఆరోపణలు చేసి ఆ పార్టీకి దూరమయ్యాడు పవన్ . మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్నందున జనసేన ని మరింత బలోపేతం చేయడానికి జిల్లా పర్యటనలకు సిద్ధం అవుతున్నాడు పవన్ . అయితే తుని లో జరిగిన విద్వ0సం మాదిరి గానే పవన్ కళ్యాణ్ సభలో అల్లర్లు సృష్టించడానికి హంతక ముఠా కి సుపారీ ఇచ్ఛారట . ఈ విషయం పవన్ కు తెలియడంతో ప్రస్తుతం వాయిదా వేసుకున్నాడు తన పర్యటనని . అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా జిల్లా పర్యటనలు చేస్తానని అంటున్నాడు పవన్ .