మహేష్ నటించిన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో వెలుగులోకి వచ్చింది తేజస్వీ మదివాడ. అయితే రామ్గోపాల్వర్మ తెరకెక్కించిన `ఐస్క్రీమ్` సినిమాతో మరింత పాపులర్ అయింది. ప్రయోగా్మకంగా నిర్మించిన ఈ చిత్రం తరువాత తేజస్వీ కెరీర్ ఊపందుకుంటుందని అనుకున్నారు, తేజస్వీ కూడా అలాగే అనుకుంది. కానీ సీన్ మారింది.
సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోయింది. తేజస్వి సినిమాల్లో కనిపించి దాదాపు రెండేళ్లవుతోంది. ఇదే సమయంలో బిగ్బాస్ 2తో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ రియాలిటీ షో తరువాత అయినా తేజస్వికి సినిమా అవకాశాలు క్యూ కడతాయని ప్రచారం జరిగింది కానీ అదీ జరగలేదు. పేరున్న హీరోల చిత్రాల్లో నటించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
దీంతో సినిమాలని పక్కన పెట్టి వెబ్ సిరీస్ల వైపు ఆసక్తి చూపిస్తోందట. ప్రస్తుతం `కమిట్మెంట్` చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో తన కెరీర్ టర్న్ తిరగాల భావిస్తోందట. ఇది వర్కవుట్ కాని పక్షంలో వెబ్ సిరీస్ల వైపు వెళ్లాలని తేజస్వీ డిసైడ్ అయినట్టు తెలిసింది.