కలర్స్ స్వాతి మళ్లీ నటిగా బిజీకావాలనుకుంటోంది. కొన్నాళ్లుగా హైదరాబాద్ని వీడిన ఆమె తాజాగా తిరిగి వచ్చేసింది. పైలెట్ వికాస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి ఆ తరువాత సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసింది. హైదరాబాద్ నుంచి తన మకాంని మార్చేసి తన భర్త వికాస్తో కలిసి ఇండోనేషియా చెక్కేసింది. అక్కడే కొన్ని నెలల పాటు హాయిగా గడిపేసిన స్వాతి ఉన్నట్టుడీ మళ్లీ హైదరాబాద్ బాటపట్టింది.
మళ్లీ నటిగా తన కెరీర్ని కొనసాగించాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. సినిమా షూటింగ్లు ప్రశ్నార్థకంగా మారిన ఈ తరుణంలో వెబ్ సిరీస్లతో మళ్లీ తన కెరీర్ ఊపందుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఓ వెబ్ సిరీస్ని కలర్స్ స్వాతీ అంగీకరించినట్టు తెలిసింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ని ఓ వెల్ నౌన్ డైరెక్టర్ రూపొందించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో స్వాతి తన భర్త నుంచి విడిపోతోందని, ఆ కారణంగానే తన ఇన్ స్టా వేదికగా వున్న ఫొటోలని డెలిట్ చేసిందంటూ వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత స్వాతి తన సోషల్ అకౌంట్లని డియాక్టివేట్ చేసి పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా వెబ్ వరల్డ్లోకి స్వాలతి ఎంటర్ ఇస్తుండటంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.