Homeన్యూస్దీపావళి తర్వాత బాబీ సినిమాను మొదలుపెట్టనున్న చిరు

దీపావళి తర్వాత బాబీ సినిమాను మొదలుపెట్టనున్న చిరు

chiranjeevi to start bobby film after deepavali
chiranjeevi to start bobby film after deepavali

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత స్పీడు పెంచాడు. మూడు చిత్రాలను ఓకే చేసాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూడు చిత్రాల అనౌన్స్మెంట్స్ కూడా జరిగాయి. ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను చేస్తున్నాడు చిరంజీవి. షూటింగ్ కూడా మొదలైంది. అయితే చిరంజీవి చేతికి చిన్న సర్జరీ కావడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు.

రెస్ట్ పూర్తైన తర్వాత తన నెక్స్ట్ సినిమాను లాంచ్ చేస్తాడు. నవంబర్ 6న బాబీ దర్శకత్వంలో రూపొందే చిత్రం లాంచ్ అవుతుంది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నవంబర్ లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రం కోసం మాస్ అవతారంలోకి మారుతున్నాడు చిరు. వాల్తేర్ వీరయ్యగా కనిపిస్తాడని టాక్. దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా, బాలీవుడ్ హీరోయిన్ చిరు సరసన నటించే అవకాశముంది.

- Advertisement -

ఈ రెండూ కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ ను కూడా చిరంజీవి ఓకే చేసిన విషయం తెల్సిందే. మరోవైపు ఆచార్య రెండు సాంగ్స్ తప్ప చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలో ఆచార్యను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేసిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All