Homeటాప్ స్టోరీస్గోపీచంద్ దర్శకుడికి చిరు ఎస్ చెబుతాడా?

గోపీచంద్ దర్శకుడికి చిరు ఎస్ చెబుతాడా?

chiranjeevi sampath nandi
chiranjeevi sampath nandi

రచ్చ చిత్రాన్ని డైరెక్ట్ చేసినప్పటి నుండి సంపత్ నంది మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలనుకుంటున్నాడు. గతంలో సంపత్ కొన్నిసార్లు ప్రయత్నించినా కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సంపత్ నందిని తన సర్కిల్ లో ఉంచుతున్నాడు.

సీటిమార్ చిత్రం సక్సెస్ సాధించిన తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం సంపత్ కు పెరిగిందనే చెప్పాలి. ఈ మధ్యన సీటిమార్ థీమ్ ను కూడా మెచ్చుకున్నా చిరు, సంపత్ నందిని స్టోరీ చెప్పమని, నచ్చితే సినిమా చేద్దామని అడిగినట్లు సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం సీటిమార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సంపత్ నంది. దీని తర్వాత చిరంజీవితో కథపై వర్క్ చేయనున్నాడు. ప్రస్తుతం చిరంజీవి వేగంగా సినిమాలను చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ను చేయబోతున్నాడు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ఉండనే ఉంది. వీటన్నిటి తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో చిరంజీవి సినిమా చెయ్యవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All