విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కుతే. తెలుగు సినిమాకు, తెలుగు జాతిని వన్నె తెచ్చిన నటుడాయన.ఆయనతో టాలీవుడ్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక అనుబంధం వుంది. ఆ అనుబంధాన్ని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిరు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనకి స్వీట్ తినిపిస్తున్న ఫొటోలని షేర్ చేశారు.
ఈ ఫొటోలతో పాటు ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ…అంటూ ట్వీట్ చేశారు చిరు. ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ని నందమూరి ఫ్యామిలీ హీరోలు సందర్శించడం లేదు. కరోనా కారణంగా లాక్డౌన్ నిబంధనలని పాటిస్తూ ఇంటి వద్దే పెద్దాయనకు నివాళులు అర్పించారు.
ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ, రెజీనా ఐటమ్ సాంగ్ తో 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ నెల 31లో లాక్డౌన్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇండోర్ షూటింగ్లకు అనుమతి ఇస్టున్న నేపథ్యంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం
తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం
నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.
వారితో కలిసి నటించడం నా అదృష్టం.
పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ… pic.twitter.com/LgSKsItxdO— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2020
Credit: Twitter