సైరా నరసింహారెడ్డి చిత్రం 3 గంటల 30 నిమిషాల నిడివి ఉండటంతో ఇంత పెద్ద గా ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారని భావించిన చిరంజీవి తన అసంతృప్తిని వెళ్ళగక్కాడట . అంతేకాదు ఎడిటింగ్ టేబుల్ మీదకు వెళ్లి ఎక్కడెక్కడ సినిమా తీసేయ్యాలో సలహాలు , సూచనలు ఇస్తున్నాడట కూడా .
సినిమా రన్ టైం తగ్గిస్తేనే మంచిదని , దర్శకుడు సురేందర్ రెడ్డి కి గట్టిగా చెప్పాడట ! చిరు స్వయంగా రంగంలోకి దిగడంతో చేసేది లేక నిడివి తాగించే పనిలో పడ్డారు సురేందర్ రెడ్డి అండ్ కో . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ , నయనతార , జగపతిబాబు , తమన్నా , అనుష్క , విజయ్ సేతుపతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు .