Homeగాసిప్స్మరో దర్శకుడితో చర్చలు జరుపుతున్న చిరంజీవి

మరో దర్శకుడితో చర్చలు జరుపుతున్న చిరంజీవి

మరో దర్శకుడితో చర్చలు జరుపుతున్న చిరంజీవి
మరో దర్శకుడితో చర్చలు జరుపుతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న ఆచార్య తర్వాత తాను చేసే సినిమాల విషయంలో స్పీడు పెంచాలని డిసైడ్ అయిపోయాడు. అందుకే ఆచార్య పూర్తయ్యాక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా లూసిఫెర్ రీమేక్ ను మొదలుపెడుతున్నాడు. దీని తర్వాత బాబీ చిత్రం, ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ఉండనే ఉన్నాయి.

అయితే గత కొన్ని రోజుల నుండి చిరంజీవి మరో సినిమాను కూడా ఓకే చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు దర్శకుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా దర్శకుడు మారుతి కూడా చిరంజీవికి ఒక స్క్రిప్ట్ ను నరేట్ చేసినట్లు, చిరు కూడా ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి.

- Advertisement -

ఇప్పుడు మరో సీనియర్ దర్శకుడు ప్రభుదేవా పేరు లైన్లోకి వచ్చింది. ప్రభుదేవాతో కలిసి చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ చేసాడు. అయితే అది రీమేక్. ఈసారి డైరెక్ట్ కథతోనే చిరు ఇంప్రెస్ చేసాడట ప్రభుదేవా. మరి దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All