Homeగాసిప్స్భారీ మ‌ల్టీస్టార‌ర్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోందా?

భారీ మ‌ల్టీస్టార‌ర్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోందా?

భారీ మ‌ల్టీస్టార‌ర్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోందా?
భారీ మ‌ల్టీస్టార‌ర్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోందా?

టాలీవుడ్‌లో మునుపెన్న‌డూ చూడ‌ని కాంబినేష‌న్ సెట్ కాబోతోందా? .. ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారా? అంటే అవునే స‌మాధానం వినిపిస్తోంది.  `ఆర్ ఆర్ ఆర్‌`తో  మెగా హీరో, నంద‌మూరి హీరోల‌ని రాజ‌మౌళి క‌లిపిన విష‌యం తెలిసిందే. ఇది సెట్స్‌పై వుండ‌గానే ఇదే త‌ర‌హా కాంబినేష‌న్ మరొక‌టి తెర‌పైకి రాబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ క‌లిసి నెవ్వ‌ర్ బిఫోర్ అనే స్థాయిలో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని చేయ‌బోతున్నార‌ట‌. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రాన్ని నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి నిర్మించ‌నున్నార‌ని చెబుతున్నారు.

- Advertisement -

గ‌త మూడేళ్ల క్రితం అంటే 2017లో సుబ్బిరామిరెడ్డి మెగాహీరోలు చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల క‌ల‌యిక‌లో మెగా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని నిర్మిస్తానంటూ ప్ర‌క‌టించారు. అయితే అది ఇంత వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజాగా అదే చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌ల క‌ల‌యిక‌లో చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందు కోసం ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌ని కూడా సిద్ధం చేసే ప‌నిలో వున్నార‌ట‌. లాక్‌డౌన్ త‌రువాత దీనిపై సుబ్బిరామిరెడ్డి ఓ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All