రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక మంచి కార్యమక్రమమనిఅందులో తాము కూడా ఓ భాగం కావాలనే భావించి మా చెరసాల చిత్ర బృందం మొక్కలు నాటిందని తెలిపారు దర్శకుడు నాంప్రకాష్ గుణ్ణం తెలిపారు. ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్పై మాదినేని సురేష్ – సుధారాయ్ గుణ్ణం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీజిత్ హీరోగా శిల్పాదాస్, నిష్కల హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్, కామెడీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకు హారర్ అంశాల్ని మిలితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాలుగు జంటల మధ్య సాగే కథ ఇదిని దర్శకుడు తెలిపారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ని నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీమ్కి బెస్ట్ విషెస్ని అందజేశారు.
దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమా నిర్మాణానికి పూనుకున్నామని, రషెస్ చూశాక చాలా సంతృప్తి అనిపించిందని, ఓ విభిన్నమైన పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత మాదినేని రమేష్ అన్నారు.