Homeటాప్ స్టోరీస్చార్మి పేరెంట్స్‌కు ఏమైంది?

చార్మి పేరెంట్స్‌కు ఏమైంది?

చార్మి పేరెంట్స్‌కు ఏమైంది?
చార్మి పేరెంట్స్‌కు ఏమైంది?

క్రేజీ హీరోయిన్‌, డ్యాషింగ్ ప్రొడ్యూస‌ర్ చార్మి కౌర్ త‌ల్లిదండ్రుల‌కు ఏమైంది? … వారి గురించి చార్మి ఎందుకు భావోద్వేగానికి గుర‌వుతోంది?.. అని ఆమె తాజా పోస్ట్‌ని చూసిన వారంతా అవాక్క‌వుతున్నారు.
చార్మి త‌ల్లిదండ్రుల‌కు తాజాగా క‌రోనా వైర‌స్ సోకింద‌ని తెలిసింది. ఇదే విష‌యాన్నిచార్మి సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. భావోద్వేగానికి లోనైంది.

లాక్‌డౌన్ వేళ క‌రోనా బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా త‌న పేరెంట్స్ క‌రోనా బారిన ప‌డ్డార‌ని వాపోయింది. ఈ నెల 22న త‌న త‌ల్లిదండ్రులిద్ద‌రు క‌రోనా బారిన ప‌డ్డార‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం వారు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని, ప్ర‌స్తుతం ఇద్ద‌రి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే వుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఇటీవ‌ల వ‌చ్చిన వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా మా వాళ్ల‌కి వైర‌స్ సోకింద‌ని చార్మి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగానే వైర‌స్ సోకిన‌ట్టు చెబుతోంది.

- Advertisement -

ఈ నెల 22 నుంచి త‌మ త‌ల్లిదండ్రులు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి కొంత మెరుగ్గా వుంద‌ని, వారి ఆరోగ్యం కుదుట‌ప‌డాల‌ని అంతా ప్రార్థ‌న‌లు చేయాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All