దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతీ ఒక్క నటుడికి ఉంటుంది , అతడి సినిమాలో చిన్న వేషం దొరికినా చాలు అని కోరుకుంటారు కానీ అది ఒకప్పుడు ఎందుకంటే మణిరత్నం ఒకప్పుడు దక్షిణాదిన మాత్రమే కాకుండా యావత్ భారతంలో కూడా గొప్ప దర్శకుడు గా పేరు పొందారు అలాగే సక్సెస్ కూడా ఉంది కాని పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది . మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి దాంతో అతడి సినిమాలో నటించడానికి కొంతమంది స్టార్స్ భయపడుతున్నారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ కూడా ఒకరు. నవాబ్ సినిమాని రిజెక్ట్ చేసాడు చరణ్ .
వరుస పరాజయాల నేపథ్యంలో కసితో నవాబ్ కథ ని రాసుకున్న మణిరత్నం నవాబ్ చిత్రంలో శింబు నటించిన పాత్రలో రాంచరణ్ చేత చేయించాలని భావించి తన సతీమణి సుహాసిని ని తీసుకుని మరీ వచ్చాడు హైదరాబాద్. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ నవాబ్ కథ చెప్పాడట ! అయితే కథ విని , శింబు పాత్ర లో నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి తెలుగులో ప్రేక్షకులు , అందునా మెగా ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని సున్నితంగా తిరస్కరించాడట . కట్ చేస్తే నవాబ్ సినిమా విడుదల అయ్యింది . తెలుగులో పెద్దగా ఆకట్టుకోవడం లేదు అయితే తమిళంలో మాత్రం హిట్ అయ్యింది. ఇక శింబు పాత్రకు కూడా అక్కడ మంచి స్పందన వస్తోంది కానీ తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు కాబట్టి చరణ్ రిజెక్ట్ చేశాడట . ఇటీవలే రంగస్థలం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.
English Title: Charan rejected maniratnam’s nawab