భారతీయ జనతా పార్టీ వ్యవస్థలను అన్నింటినీ నాశనం చేసిందని అందుకే భారత దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కలిసానని స్పష్టం చేసారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కలవడం సంచలనం సృష్టిస్తోంది . భారత రాజకీయాల్లో ఇది సరికొత్త విప్లవానికి నాంది అవుతుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు . ఆంధ్రపదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మాత్రం మొండి చేయి చూపించాడు . దాంతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్ డి ఎ నుండి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది .
ఇక అప్పటినుండి తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీ ల మద్య ఉప్పు నిప్పు లా తయారయ్యింది పరిస్థితి . పెద్ద నోట్లు రద్దు , జీ ఎస్ టి లతో ప్రజలంతా కష్టాలు పడుతుండటంతో కేంద్రంలోని మోడి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో బద్ద వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ తో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాడు చంద్రబాబు నాయుడు . అందులో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ ని కలిసాడు . పలు అంశాలపై చర్చించిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు బాబు – రాహుల్ . త్వరలోనే మిగతా పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాలనీ భావిస్తున్నాడు చంద్రబాబు నాయుడు .
English Title: Chandrababu , Rahul Gandhi join hands to defeat BJP