
యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ చాణక్య, చిరంజీవి సైరాకు పోటీగా మరో మూడు రోజుల్లో విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ప్రోమోలతో ప్రేక్షకులలో బాగానే ఆసక్తి కలిగించిన నేపథ్యంలో సినిమా మీద ఆసక్తి పెరిగింది. దసరా సీజన్ లో విడుదలవుతున్న ఈ సినిమాపై బయ్యర్లు కూడా బాగానే పెట్టుబడి పెట్టారు.
ప్లాపుల్లో ఉన్నా కానీ గోపీచంద్ చిత్రంపై నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. తిరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ ఇటీవలే క్లోజ్ అయింది. సాటిలైట్ రైట్స్ ను మాటీవీ దక్కించుకుంది. డిజిటల్ రైట్స్ అమెజాన్ కు దక్కాయి. ఈ రెండిటికీ కలిపి దాదాపు 6 కోట్ల వరకూ నిర్మాతకు ముట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఇది యాక్షన్ స్పై థ్రిల్లర్ కాబట్టి బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. అందుకే హిందీ డబ్బింగ్ రైట్స్ కు 9 కోట్ల వరకూ పలికింది. అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే చాణక్య 15 కోట్లు సంపాదించింది. ఇక సినిమా ఏమాత్రం బాగున్నా అందరికీ ఇది ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది అనడంలో సందేహం లేదు.