Homeటాప్ స్టోరీస్సెన్సార్ చిక్కుల్లో సాక్ష్యం

సెన్సార్ చిక్కుల్లో సాక్ష్యం

Censor problem facing bellamkonda sakshyamబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. ఈనెల 27న భారీ ఎత్తున ఆ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కానీ సెన్సార్ చిక్కుల్లో చిక్కుకుంది సాక్ష్యం చిత్రం . సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసారు సర్టిఫికెట్ ఇవ్వడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో సెన్సార్ వాళ్ళు పిచ్చ షాక్ ఇచ్చారట ! ఇంతకీ సెన్సార్ వాళ్ళు సాక్ష్యం యూనిట్ కు ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా…… ఎన్ ఓ సి తీసుకురావాలని చెప్పడమే ! సాక్ష్యం సినిమాలో జంతువులు ను ఉపయోగించారు .

ఇంతకుముందు రోజుల్లో అంటే నడిచింది కానీ ఇప్పుడు మాత్రం జంతువుల ను , పశువుల ను సినిమాల్లో వాడుకుంటే ఇబ్బందే జంతు సంరక్షణ సమితి నుండి అనుమతి పొందాల్సిందే . లేకపోతే సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వరు. ఇప్పుడు ఇదే సమస్య ఎదుర్కొంటోంది సాక్ష్యం చిత్రం . పంచ భూతాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై బెల్లంకొండ సురేష్ అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కనుక హిట్ అయితే బెల్లంకొండ కష్టాలు తీరిపోతాయి అందుకే కష్టపడి మరీ ఈ డేట్ ని ఎంచుకున్నాడు . ఈలోపు ఎన్ ఓ సి వస్తే సినిమా విడుదల అవుతుంది లేకపోతే వాయిదా పడే అవకాశం ఉంది. అయితే బెల్లంకొండ ఇలాంటి విషయాల్లో ఉద్దండుడు కాబట్టి ఎలాగైనా సరే తెచ్చినా తెస్తాడు . సాయి శ్రీనివాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే నటించిన సాక్ష్యం హిట్ కు సాక్ష్యం గా నిలుస్తుందా చూడాలి.

- Advertisement -

English Title: censor problem facing bellamkonda sakshyam

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All