Homeగాసిప్స్స్టైలిష్‌స్టార్‌..రౌడీ స్టార్ క‌లుస్తున్నారా?

స్టైలిష్‌స్టార్‌..రౌడీ స్టార్ క‌లుస్తున్నారా?

స్టైలిష్‌స్టార్‌..రౌడీ స్టార్ క‌లుస్తున్నారా?
స్టైలిష్‌స్టార్‌..రౌడీ స్టార్ క‌లుస్తున్నారా?

టాలీ‌వుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల జోరు ఊపందుకుంది. మునుపెన్న‌డూ లేని విధంగా స్టార్ హీరోలు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు సై అంటున్నారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌` రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్రేర‌ణ‌తో ఇటీవ‌ల ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ద‌గ్గుబాటి రానాల క‌ల‌యిక‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మొద‌లైంది.

మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర ‌నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ సోమ‌వారం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో మొద‌లైంది. ఇదిలా వుంటే మ‌రో క్రేజీ కాంబోలో మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌పైకి రానున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నారంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ చిత్రానికి `యాత్ర‌` ఫేమ్ మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్నార‌ని,
ఈ చిత్రాన్ని ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌తో క‌లిసి స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మించ‌నున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. బ‌న్నీ ప్ర‌స్తుతం `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌`లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All