
హీరో రామ్..ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ది వారియర్ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ లోని బుల్లెట్ సాంగ్ శుక్రవారం విడుదలై యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. కోలీవుడ్ హీరో శింబు ఈ సాంగ్ ను పాడడం విశేషం. దేవి శ్రీ మరో సారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వగా..శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసాడు. రామ్ – కృతి శెట్టి లు ఇద్దరు కూడా అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సాంగ్ కోసం మేకర్స్ మూడు కోట్లు ఖర్చు చేశారట. ఇక ఈ మూవీ లో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా రామ్ కనిపిస్తుండడం..రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. జులై 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.