వైష్ణవ్తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం `ఉప్పెన`. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రమిది. ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు బుచ్చిబాబు సానా. తొలి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్లో చేరిన బుచ్చిబాబు ఈ మూవీతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. దర్శకుడిగా భారీ క్రేజ్ని, డిమాండ్ని ఏర్పాటు చేసుకున్నారు.
దర్శకుడిగా తొలి చిత్రంతోనే తనదైన ముద్ర వేసిన బుచ్చిబాబు తాజాగా తన రెండవ చిత్రానికి సరికొత్త రికార్డుని నమోదు చేసుకున్నారు. రెండవ చిత్రానికే 10 కోట్ల పే చెక్ని అందుకున్న తొలి దర్శకుడిగా రికార్డుని సాధించారు సానా బుచ్చిబాబు. కేవలం 18 కోట్లతో నిర్మించిన `ఉప్పెన` చిత్రానికి 45 కోట్ల షేర్ని, 15 కోట్ల డిజిటల్ రైట్స్ రూపంలో రాబట్టడమే కాకుండా ఈ మూవీని వంద కోట్ల క్లబ్లో చేర్చడం ఇండస్ట్రీ వర్గాలని విశేషంగా ఆకట్టుకుంది.
`ఉప్పెన`తో తమకు లాభాల పంట పండించిన బుచ్చిబాబుతో మరో చిత్రాన్ని అగ్రిమెంట్ చేసుకుంది. ఇందుకు గానూ జీఎస్టీతో కలిపి 10 కోట్ల పే చెక్ని అందించి ఆశ్చర్యపరిచింది. `ఉప్పెన` హిట్ తరువాత బెంజ్ కార్ని గిఫ్ట్గా ఇచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన మైత్రీ ప్రొడ్యూసర్స్ ఆ వెంటనే మరో ప్రాజెక్ట్ని బుచ్చిబాబుతో ఓకే చేయంచుకున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేయబోతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి వుంది.