నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలవడమే కాకుండా బాలయ్య కెరీర్కి నూతన జవసత్వాలని అందించాయి. ఈ గురువారంతో బాలయ్య, బోయపాటిల తొలి కలయికలో వచ్చిన `సింహా` విడుదలై 1ఏ ఏళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా వీరిద్దరి కలయికలో ముచ్చటాగా మూడవ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంపై దర్శకుడు బోయపాటి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. మా ఇద్దరి కలయికలో వచ్కచిన `సింహా` చూశారు. ఆ తరువాత `లెజెండ్` చూశారు. ఈసారి అంతకు మించిన కొత్తదనాన్ని చూపించాలనుకుంటున్నాం. ఆ విషయంలో చాలా శ్రమించాను. కొత్తదనం కోసం క్యారెక్టరైజేషన్ నుంచి కథ చెప్పాలనుకున్నాం. ఇందులో బాలయ్య మరింత కొత్తగా కనిపిస్తారు.
ఇందులో బాలయ్య అఘోరాగా కనిపిస్తారు. ఆ వార్త నిజమే. అయితే ఆ పాత్రని ఎలా డిజైన్ చేశాం, తెరపై ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అన్నది మాత్రం సస్పెన్స్. ఈ క్వారెంటైన్ టైమ్లో ముందు రాసుకున్న కొన్ని పాత కథల్ని పాలీష్ చేశాను. బాలయ్య సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఓ యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్స్ ని పూర్తి చేశాం` అని బోయపాటి వెల్లడించారని తెలిసింది.