రిచ్ హీరోని పట్టిన బోయపాటి
మాస్ దర్శకులు బోయపాటి శ్రీను రిచ్ హీరోని పట్టాడు . కన్నడ హీరో నిఖిల్ గౌడ తో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకులు బోయపాటి శ్రీను . ఈ ఏడాది రాంచరణ్ తో వినయ విధేయ రామ అనే చిత్రాన్ని చేసాడు బోయపాటి అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో బాలయ్య తో చేయాల్సిన సినిమా రద్దు అయ్యింది దాంతో హీరోల వేటలో పడ్డాడు బోయపాటి .
ఇక నిఖిల్ గౌడ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు కావడంతో అతడితో మాస్ సినిమా ఒకటి చేసే పనిలో పడ్డాడు బోయపాటి . నిఖిల్ గౌడ తన మొదటి చిత్రాన్ని జాగ్వార్ తెలుగులో కూడా విడుదల చేసాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది . దాంతో హీరోగా నిలదొక్కుకోలేక మాండ్య పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసాడు కానీ సుమలత చేతిలో ఓడిపోయాడు నిఖిల్ . ఇంకేముంది రాజకీయాలను పక్కన పెట్టి మళ్ళీ సినిమాల మీద దృష్టి పెట్టాడు నిఖిల్ .