ఈ నెల 14న ముగియాల్సిన లాక్డౌన్ని మే 3 వరకు ప్రధాని మోదీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది సముచిత నిర్ణయమని దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. కోవిడ్ -19పై రాజీలేని పోరాటం సాగించడానికి లాక్ డౌన్ని మించిన ఆయుధం లేదని నిపుణులంతా చెబుతున్న విషయం. ఇప్పటి వరకు 21 రోజుల లాక్ డౌన్ను దేశంలోని అందరం ఏకతాటిపైకి వచ్చి విజయవంతం చేశాం. దీని ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగాం.
ఈ రోజు నుంచి మరో 19 రోజుల పాటు ఇదే స్ఫూర్తితో స్వీయ నియంత్రణతో లాక్డౌన్ను వి.జయవంతం చేసి కరోనా మహమ్మారిపై విజయం సాధించాని మనసారా కోరుకుంటున్నాను. దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా పనిచేస్తున్నాయి. అహర్నిశం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు సలహాలు, సూజనలు ఇస్తూ చైతన్య పరుస్తున్న ప్రభుత్వ యంత్రాంగాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను` అన్నారు బోయపాటి.
కరోనా వ్యాప్తిపై పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్న తీరుకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా, మన దేశం ఇంత ప్రభావవంతంగా కరోనాపై పోరాడుతున్నదంటే అందుకు వాళ్లు అద్భుతంగా చేస్తున్న సేవలే ప్రధాన కారణం. అలాగే పారిశుధ్య కార్మికులు కూడా తమ వంతు పాత్రను గొప్పగా పోషిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లినా, దాని కంటే ప్రజల ప్రాణాలే గొప్పవని ప్రధాని చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. సినిమా ఇండస్ట్రీపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగానే వుంది. ప్రధానంగా ఉపాధి కోల్పోయిన పేద కళాకారులకు, దనసరి వేదనంతో జీవించే కార్మికులను ఆదుకోవడానికి సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా ముందుకు రావడం ముదావహం.
కరోనా వైరస్ ఎంత భయానకమైనా, దాని వల్ల దేశమంతా ఒక్కటే ననే భావన ఏర్పడటం, కుల మత భేధం లేకుండా పేద ధనికి తారతమ్యం లేకుండా అందరం ఐకమత్యం ప్రదర్శించడం గొప్ప విషయం. గొప్ప విషయం. ఇదే స్ఫూర్తితో మే 3 వరకు కొనసాగనున్న లాక్డౌన్ ను విజయవంతం చేద్దాం. ఇంట్లో వుందాం. క్షేమంగా వుందాం` అని వెల్లడించారు బోయపాటి శ్రీను.