బాలీవుడ్లో కరోనా ఓ పక్క విళయతాండవం చేస్తోంది. మరో పక్క అనారోగ్య కారణంగా వరుస విషాదాలు అలుముకుంటున్నాయి. కరోనా కారణంగా బాలీవుడ్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 28 ఏళ్ల కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ అకస్మికంగా మృతి చెందడం పలువురిని భయాందోళనకు గురిచేస్తోంది. పలు హిట్ చిత్రాలకు కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేసిన క్రిష్ కపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని కొంత మంది అంటుంటే అతని అంకుల్ మాత్రం బ్రెయిన్ హేమరేజ్ కారణంగా మృతి చెందాడని పొంతన లేకుండా చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా వుంటే తాజాగా కరోనా వైరస్ కారణంగా అన్వర్ సాగర్ (70) మృతి చెందడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బాలీవుడ్లో ప్రముఖ లిరిసిస్టుగా పేరుతెచ్చుకున్న అన్వర్ సాగర్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో దుతి శ్వాస విడిచారు. అయితే ఆయన మృతికి గత కారణాలేంటో తెలియలేదు.
అన్నర్ సాగర్ మృతి పట్ల బాలీవుడ్కు చెందిన సెలబ్రిటీలు అంతా సంతాపం వ్యక్తం చేశారు. అజయ్దేవగన్, అక్షయ్కుమార్ చిత్రాలకు సాహిత్యం అందించి సూపర్ హిట్ గీతాల్ని అందించారు.