బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కేసరి చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది . 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కేసరి చిత్రం ఈనెల 21న రిలీజ్ అయ్యింది . అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించడం విశేషం . ఈ సినిమా అయిదు రోజుల్లోనే 93 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది .
ఇంకా బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో ఈ చిత్రం అవలీలగా 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కేసరి కి భారీగా లాభాలు వచ్చేలా కనబడుతున్నాయి . శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలోనే వస్తున్నాయి దాంతో హీరోతో పాటుగా బయ్యర్లు , నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు .
English Title : Bollywood film Kesari joins 100 crores club