Homeగాసిప్స్కోటి రూపాయలతో కుమ్ముకుంటోన్న హాట్ యాంకర్

కోటి రూపాయలతో కుమ్ముకుంటోన్న హాట్ యాంకర్

కోటి రూపాయలతో కుమ్ముకుంటోన్న హాట్ యాంకర్
కోటి రూపాయలతో కుమ్ముకుంటోన్న హాట్ యాంకర్

బిగ్ బాస్ పూర్తయి రెండు వారాలు గడిచినా కాని ఇంకా దాని గురించిన వార్తలు మాత్రం తగ్గట్లేదు. బిగ్ బాస్ గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 3 ఫైనలిస్ట్స్ రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి గురించి వార్తలు తగ్గట్లేదు. బిగ్ బాస్ పూర్తవ్వడంతో వారి పారితోషికం వివరాలు బయటకు పొక్కాయి. దాంతో మీడియా రోజుకోరకంగా వివిధ కోణాల్లో వార్తలు అల్లేసి పండగ చేసుకుంటోంది. ఈ మధ్య బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పారితోషికం గురించి ఇలాగే వార్తలు రాసింది ఒక మీడియా సంస్థ. రాహుల్ బిగ్ బాస్ విన్ అయినందుకు వచ్చిన 50 లక్షల చెక్ తో పాటు రోజుకి లక్షకు పైగా తీసుకుంటున్నట్టు కథనాలు ప్రచురించింది. ఈ వార్తలపై రాహుల్ స్పందించాడు. అందరూ అనుకుంటున్నట్లు మాకు రోజుకు లక్ష రూపాయల పేమెంట్ అనేది లేదు. బయట ప్రచారంలో ఉన్నదానికంటే చాలా తక్కువ. నేను ఒక్క షో చేస్తే ఛార్జ్ చేసే అమౌంట్ కంటే బిగ్ బాస్ లో ఉన్నందుకు తీసుకున్నదే తక్కువ అని పేర్కొన్నాడు.

అయితే దీనిపై కూడా భిన్న కథనాలు వచ్చాయి. కావాలనే రాహుల్ ఫిగర్స్ తక్కువ వేసి చెప్పాడని, అసలు నంబర్స్ బయటకి రాకూడదు కాబట్టి జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మాట మార్చాడని అన్నారు. రాహుల్ సంగతి తెలీదు కానీ శ్రీముఖి మాత్రం కచ్చితంగా రోజుకి లక్షకు పైనే ఛార్జ్ చేసిందట. షో కు వచ్చే ముందే 15 వారాలు షో లో కచ్చితంగా ఉంటానన్న మాట తీసుకున్నాకే శ్రీముఖి షో కు రావడానికి ఒప్పుకుందట. రోజుకి లక్ష చొప్పున ఆమె ఉన్నది 105 రోజులు కాబట్టి కోటి దాటేసింది. టాక్స్ లు తీసేసినా కూడా ఆమె దాదాపు కోటి రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది. అందుకే శ్రీముఖి హౌజ్ నుండి బయటకు వచ్చిన వెంటనే స్నేహితులతో, ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ వారం రోజుల పాటు ఫుల్ రిలాక్స్ అయిపోయాక రీసెంట్ గా తిరిగి హైదరాబాద్ చేరుకుందిట శ్రీముఖి.

- Advertisement -

పారితోషికంతో పాటు స్టార్ మా కు కొన్ని షోస్ కి యాంకరింగ్ చేసేలా కూడా ఒప్పందం మీద సంతకం చేసిందట శ్రీముఖి. అయితే తను మళ్ళీ డిసెంబర్ నుండే తిరిగి షూట్ లలో పాల్గొంటానని పేర్కొంది. ఈ మూడున్నర నెలలు తాను కుటుంబాన్ని, ఇంటిని చాలా మిస్ అయ్యానని అందుకే ఈ నెల మొత్తం రెస్ట్ తీసుకుని మళ్ళీ నూతనోత్సాహంతో షోస్ ఒప్పుకుంటానని చెబుతోంది. మొత్తానికి బిగ్ బాస్ లో పాల్గొన్న అందరూ షో అయిపోగానే ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక్క శ్రీముఖి మాత్రం ఈ విషయంలో ఎస్కేప్ అయింది. ఎవరికీ చిక్కకుండా హాలిడేస్ కు చెక్కేసింది. ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చింది కాబట్టి ఇప్పుడేమైనా ఇంటర్వ్యూలు ఇస్తుందేమో చూడాలి.ఇటీవలే శ్రీముఖి సోషల్ మీడియాలో మాట్లాడుతూ రాహుల్ బిగ్ బాస్ టైటిల్ గెలిచినా కానీ తన దృష్టిలో రియల్ విన్నర్ బాబా భాస్కర్ అని చెప్పిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All