దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముంబైలో ప్రమాద స్థాయిని తాకింది. హైదరాబాద్లోనూ ఇంచుమించు అదే స్థాయిలో వణికిస్తోంది. సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలని, పొలిటికల్ లీడర్లని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రీసెంట్గా టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్కు కరోనా వైరస్ సోకడంతో టాలీవుడ్ వర్గాలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదిలా వుంటే తాజాగా ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, కమ్ డిస్ట్రీబ్యూటర్ సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. మీడియాలో దీనికి సంబంధించి వరుస కథనాలు వినిపిస్తున్నాయి. విషయం తెలిసిన వెంటనే సదరు నిర్మాత తన ఆఫీస్ కార్యాలయాన్ని మూసివేసినట్టు చెబుతున్నారు. ఈ విషయం బయటికి పొక్కడంతో సమీపంలో వున్న సినిమా ఆఫీసులన్నీ మూసేశారట.
తాజా సంఘటనతో నిర్మాతలంతా ఎలర్ట్ అయ్యారని, సినిమా షూటింగ్లు జరగని ఈ విపత్కర సమయంలో ఆఫీసులు తెరవడం అత్యంత ప్రమాదకరమని భావించి ఆఫీసులకు తాళాలు వేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇంతకీ వైరస్ ఏ నిర్మాత సిబ్బందికి సోకింది?. ఆ సిబ్బంది పరిస్థితి ఏంటనేది మాత్రం ఇంత వరకు తెలియరాలేదు.