Homeటాప్ స్టోరీస్ప్రేక్షకులను 'వాడు' అని..క్షేమపణలు కోరిన భీమ్లా నాయక్ నిర్మాత

ప్రేక్షకులను ‘వాడు’ అని..క్షేమపణలు కోరిన భీమ్లా నాయక్ నిర్మాత

ప్రేక్షకులను 'వాడు' అని..క్షేమపణలు కోరిన భీమ్లా నాయక్ నిర్మాత
ప్రేక్షకులను ‘వాడు’ అని..క్షేమపణలు కోరిన భీమ్లా నాయక్ నిర్మాత

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత నాగ వంశీ ప్రేక్షకులకు క్షేమపణలు చెప్పారు. వరుస సినిమాలతో దూసుకెలుతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్..రీసెంట్ గా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో డీజే టిల్లు అనే సినిమా చేసారు. ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. హౌస్ ఫుల్ కలెక్షన్ల తో దూసుకెళ్తున్న సందర్భాంగా వైజాగ్ లో మూవీ సక్సెస్ మీట్ ఏర్పటు చేసారు.

ఈ సక్సెస్ మీట్ అనంతరం నాగవంశీకి కలెక్షన్స్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆడియన్స్ లెక్కలు చూస్తారు అన్నట్టు ఏ మీడియా రిపోర్టర్ వంశీ కి ప్రశ్న వేశారు. ఈ క్రమంలో నాగవంశీ స్పందిస్తూ.. ‘ఈ లెక్కలన్నీ మనలాంటి మేధావులకు కావాలి కానీ ఆడియన్ గా వాడిచ్చే 150రూపాయలకు వాడు నవ్వుకున్నాడా? లేడా అనేది సరిపోతుంది. వాడిచ్చే 150 రూపాయలకు 1500 విలువ నవ్వించాం. అదే చాలు వాడికి. వాడు హ్యాపీ` అని కామెంట్స్ చేశారు. ఆడియన్స్ ను వాడు, వీడు అని సంబోధిస్తూ నాగ వంశీ మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా నాగవంశీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో వంశీ ప్రేక్షకులను క్షేమపణలు తెలిపారు.

- Advertisement -

ఈ మేరకు ట్విట్టర్ లో ”ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థ కైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో ‘డిజె టిల్లు’ విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షకులను ఏకవచనం తో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించటం వల్లే. అయినా వారి మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం” అంటూ ట్విట్టర్ లో క్షమాపణలు కోరారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All