Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్

ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్

ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్
ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్

పవన్ కళ్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్..ఈరోజు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక ను క్యాన్సిల్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.  ఏపీ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండె పోటు కారణంగా సోమవారం ఉదయం హఠాత్తుగా మృతిచెందరు. ఆయన మృతితో షాక్ కు గురైన `భీమ్లా నాయక్ ` మేకర్స్ తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.

అలాగే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ సైతం అధికారిక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ , రానా కలయికలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ లో రానా విలన్ రోల్ లో నటిస్తుండగా ..పవన్ కు జోడిగా నిత్యా మీనన్ , రానా కు జోడి గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కే డైరెక్ట్ చేస్తుండగా…త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ / ఏ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈరోజు సోమవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. ముఖ్య అతిధులుగా కేటీఆర్ , తలసాని శ్రీవాస్ యాదవ్ లను ఆహ్వానించడం జరిగింది. ఇదే వేడుకలో ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏపీ మంత్రి గౌతమ్ మరణంతో ఈ మెగా వేడుకను వాయిదా వేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All