Homeన్యూస్అడ్వాన్స్ బుకింగ్స్ తో సరికొత్త రికార్డు సృష్టించబోతున్న భీమ్లా నాయక్

అడ్వాన్స్ బుకింగ్స్ తో సరికొత్త రికార్డు సృష్టించబోతున్న భీమ్లా నాయక్

అడ్వాన్స్ బుకింగ్స్ తో సరికొత్త రికార్డు సృష్టించబోతున్న భీమ్లా నాయక్
అడ్వాన్స్ బుకింగ్స్ తో సరికొత్త రికార్డు సృష్టించబోతున్న భీమ్లా నాయక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నాడు. గత కొద్దీ నెలలుగా యావత్ సినీ లోకం , అభిమానులు ఎదురుచూస్తున్న బీమ్లా నాయక్ ..ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేయగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు. వకీల్ సాబ్ తర్వాత  పవన్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తున్నారు నిర్మాత నాగ వంశీ.

- Advertisement -

ఇదిలా ఉంటె ఓవర్సీస్ లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్  ఇప్పటికే మొదలయ్యాయి. అయితే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భీమ్లా నాయక్ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ మాములుగా ఉండదు. పవన్ నుండి వచ్చిన ప్రతి సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్స్ తో 100K డాలర్లను అందుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది అడ్వాన్స్ ప్రీ సేల్స్ తోనే అత్యధిక వసూళ్లను అందుకున్న ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసినట్లే. ఇక ఒక మిలియన్ డాలర్లను ఈ సినిమా చాలా తొందరగానే అందుకుంటుంది అని అంత అంటున్నారు. మరి అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రేంజ్ లో ఉంటె..మిగతా టిక్కెట్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All