Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ టాక్ తో మళ్లీ పుంజుకున్న భీమ్లా నాయక్ కలెక్షన్స్

రాధే శ్యామ్ టాక్ తో మళ్లీ పుంజుకున్న భీమ్లా నాయక్ కలెక్షన్స్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో రివేంజ్ డ్రమాగా తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా , నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించగా , థమన్ మ్యూజిక్ అందించారు.

మొదటి వారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ , రెండో వారం నుండి తగ్గడం మొదలుపెట్టింది. ఇక రాధే శ్యామ్ రిలీజ్ రోజు భారీగా తగ్గగా, రాధే శ్యామ్ కు డివైడ్ టాక్ రావడం తో శనివారం భీమ్లా కలెక్షన్లు పుంజుకున్నాయి.

- Advertisement -

16 వ రోజు కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 16వ రోజు దీనికి రూ. 25 లక్షలు షేర్‌‌తో పాటు రూ. 52 లక్షలు గ్రాస్ వచ్చింది.

మొత్తం 16 రోజుల కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 34.76 కోట్లు
సీడెడ్‌లో రూ. 11.06 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 7.57 కోట్లు
ఈస్ట్‌లో రూ. 5.47 కోట్లు
వెస్ట్‌లో రూ. 4.96 కోట్లు
గుంటూరులో రూ. 5.21 కోట్లు
కృష్ణాలో రూ. 3.78 కోట్లు
నెల్లూరులో రూ. 2.54 కోట్లతో కలిపి రూ. 75.35 కోట్లు షేర్, రూ. 115.25 కోట్లు గ్రాస్‌ దక్కింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 96.07 కోట్లు షేర్‌తో పాటు రూ. 156.41 కోట్ల గ్రాస్ సాధించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All